కరీంనగర్ జిల్లా/ హుజరాబాద్:వసంత పంచముని పురస్కరించుకొని బుధవారం హుజురాబాద్ రంగనాయకుల గుట్ట వద్ద గల సరస్వతీ మాత సహిత దేవాలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. వేద పండితుల చేత అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక, శ్రీనివాస్ మాట్లాడుతూ.. హుజురాబాద్ నియోజకవర్గం లోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నామన్నారు. వసంత పంచమి రోజున ఏ పనులు చేసిన వాటిలో విజయం సాధిస్తాం అన్నారు. అమ్మవారి కృప వల్ల చిన్నారులు చదువులో రాణించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పండితులు తిరుమల్, ప్రదీప్ లతోపాటు ప్రజలు పాల్గొన్నారు.
Post Views: 82












