+91 99635 77856

ఎమ్మెల్సీకి వినతి పత్రం అందించిన జూపాక కాంగ్రెస్ నాయకులు..

కరీంనగర్ జిల్లా/హుజురాబాద్: మండలం లోని జూపాక గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్సీ కోట నుంచి నిధులు కేటాయించాలని గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఆదివారం ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కు వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్సీగా నియమకం అయిన తర్వాత మొదటిసారిగా హుజురాబాద్ వచ్చిన బల్మూరి వెంకట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.గత పది సంవత్సరాల నుండి జూపాక అభివృద్ధి చెందలేదని ప్రధాన సమస్య అయిన హుజురాబాద్-జూపాక ప్రధాన రహదారిపై ఉన్న బ్రిడ్జి నిర్మాణం కోసం, జూపాక బస్టాండ్ నుండి హై స్కూల్ వరకు సిసి రోడ్డు, ఓపెన్ జిమ్,మినీ లైబ్రరీ కోసంనిధులు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ ద్వారా వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఇల్లందుల శ్రీనివాస్, మారేపల్లి ప్రసాద్, హరీష్, శ్యాంప్రసాద్, చందు, భరత్, గిన్నారపు అక్షయ్, చక్రి లతోపాటు బిఎస్పి మండల అధ్యక్షుడు గిన్నారపు మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !