మంత్రి సితక్కను సన్మానించిన వొడితల ప్రణవ్
కరీంనగర్ జిల్లా/ హుజూరాబాద్ :తెలంగాణ రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సీతక్క (దనసరి అనసూయ) వరంగల్ నుండి కరీంనగర్ వెళ్లే క్రమంలో ఆదివారం మండలం లోని సింగాపూర్ గ్రామంలోని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ వోడితల ప్రణవ్ నివాసానికి వచ్చారు. మంత్రి సీతక్క కు వొడితల ప్రణవ్ ఘనంగా స్వాగతం పలికారు. మంత్రి సీతక్కకు పుష్ప గుచ్చం అందజేసి శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వొడితల ప్రణవ్ హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని మంత్రి సీతక్క ను కోరారు. తాను సానుకూలంగా స్పదించి హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కిరణ్, దొంత రమేష్, చందమల్ల నరేష్, రఘుపతి రెడ్డి తదితరులు ఉన్నారు.
Post Views: 306













