+91 99635 77856

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

హుజురాబాద్/ జూలై 11 (మా అక్షరం): పట్టణంలోని ఎల్‌ఐసీ కార్యాలయం సమీపంలో శనివారం ఓ మహిళ బావిలో మృతదేహంగా కనిపించడం కలకలం రేపింది. మృతురాలిని చింత సునీతగా పోలీసులు గుర్తించారు.
స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బావిలో నుంచి మృతదేహాన్ని వెలికితీశారు. భర్త మరణించడంతో ఇద్దరు పిల్లలతో కలిసి సునీత అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నట్లు స్థానికులు తెలిపారు.మృతురాలి మెడకు తాడు బిగించి ఉండటంతో, గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి బావిలో పడేసి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మృతికి గల అసలు కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !