+91 99635 77856

మృతుని కుటుంబానికి స్నేహితుల చేయూత

హుజురాబాద్/మే 18(మాఅక్షరం) : హుజురాబాద్ పట్టణంలో గాయత్రి మార్బుల్ షాప్ నిర్వాహకుడు, ఆర్.ఎం.పి ఇప్పలపల్లి రవీందర్ నెల రోజుల క్రితం శాలపల్లి-ఇంద్రనగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఆయన కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఆయన స్నేహితులు స్వచ్ఛందంగా ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఎవరికి తోచినంత వారు ఆర్థిక సాయం చేయడంతో రూ. 1,20,500 పోగు చేసి అతని భార్య రేణుక పేరు మీద ఫిక్స్ డిపాజిట్ చేసి ఆమెకు బండ్ ను శనివారం అందజేశారు. మృతుడు రవీందర్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉండడంతో వారి భవిష్యత్తు అవసరాల కోసం ఈ ఆర్థిక సహాయం ఉపయోగపడుతుందని ఆయన స్నేహితులు తెలిపారు. బండ్ ను అందజేసిన వారిలో అతని స్నేహితులు టి రమేష్, శ్రీనివాస్ గోవర్ధన్, పరమేష్, జ్ఞానేశ్వర్, రాజారెడ్డి తదితరులు ఉన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !