హుజురాబాద్/ జూలై 16(మా అక్షరం): మున్సిపల్ విశ్రాంత ఉద్యోగి రొంటాల వైకుంఠం అనారోగ్యంతో ఇటీవల మరణించగా ఆయన కుటుంబాన్ని మంగళవారం హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పరామర్శించారు. వైకుంఠం కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులైన సుధీర్,సురేష్, సుమన్ లతో పాటు కుటుంబ సబ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైకుంఠం మరణం కుటుంబానికి తీరని లోటని అన్నారు. కుటుంబ సభ్యులంతా ధైర్యంగా ఉండాలని తాను వైకుంఠం కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని అన్నారు. ఎమ్మెల్యే వెంట ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ. శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ గందే రాధిక,శ్రీనివాస్ కౌన్సెలర్లు ముక్క రమేశ్, మొలుగు. పూర్ణ చందర్ తదితరులు ఉన్నారు.
Post Views: 157











