హుజురాబాద్/ జులై 23(మా అక్షరం): మాజీ రాజ్యసభ సభ్యులు స్వర్గీయ వొడితల రాజేశ్వరరావు 13 వర్ధంతి బుధవారం హుజురాబాద్ లో నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ బాబు తెలిపారు. మంగళవారం అయన విలేకరులతో మాట్లాడుతూ…
బుధవారం ఉ దయం 10 గంటలకు హుజురాబాద్ పట్టణంలోని సైదాపూర్ క్రాస్ రోడ్ వద్ద ఉన్న మాజీ స్వర్గీయ వొడితల రాజేశ్వర్ రావు విగ్రహం వద్ద అయన వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, కోడూరు సత్యనారాయణ గౌడ్, స్థానిక నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పాల్గొంటారని, రాజేశ్వర్ రావు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అయన కోరారు.
Post Views: 181











