హుజురాబాద్/జులై 26(మా అక్షరం):
ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలని మున్సిపల్ అధికారులు అన్నారు. పట్టణంలోని 2వ వార్డులో శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…ఇంటి పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మురుగు నీటిని ఎల్లప్పుడూ తొలగించుకోవాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రత తో పాటు వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలన్నారు.ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం 2వ వార్డు కౌన్సిలర్ బర్మావత్ యాదగిరినాయక్, మెడికల్ హెల్త్ అసిస్టెంట్ కే సత్యం, 2వ వార్డు అధికారి ఏం కొమురయ్య, ఇంచార్జి సానిటరీ ఇన్స్పెక్టర్ ఏం కిషన్ రావు, సానిటరీ జవాన్ తూముల కుమారస్వామి, ఆశా వర్కర్లు తిరుపతమ్మ , మెప్మా ఆర్ పి లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post Views: 95











