హుజురాబాద్/ఆగస్టు 07(మా అక్షరం): హుజురాబాద్ పురపాలక సంఘం లోని ఇప్పల నర్సింగాపూర్ గ్రామానికి చెందిన బిజెపి నాయకులు పల్లె శ్రీనివాస్ గౌడ్ బుధవారం అకాల మరణం చెందడం పట్ల బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. బిజెపి శ్రేణులతో కలిసి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఇప్పల్ నర్సింగాపూర్ గ్రామంలో శ్రీనివాస్ గౌడ్ పార్దివదేహానికి పార్టీ జెండా కప్పి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా
శ్రీనివాస్ గౌడ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని,సంతాపాన్ని తెలియజేశారు. ఆయన వెంట పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు, బీజేపీ నాయకులు కొట్టే మురళీ కృష్ణ,సింగిరాల రామరాజు,తూర్పాటి రాజు, అజార్ యల్ల సంజీవ రెడ్డి, యాంశని శశిధర్, సబ్బని రమేష్, గంగిశెట్టి ప్రభాకర్,కోలిపాక శ్రీనివాస్,చింత శ్రీనివాస్,పడాల కొమురయ్య, దండ సమ్మిరెడ్డి,నరాల రాజశేఖర్,నాగరాజు,నగేష్, హృత్విక్ తదితరులు పాల్గొన్నారు.











