హుజురాబాద్/ సెప్టెంబర్ 27(మా అక్షరం): మండలంలోని ధర్మరాజు పల్లి గ్రామానికీ చెందిన కోట లక్ష్మణ్ మృతి చెందగా శుక్రవారం ఆయన కుటుంబాన్ని హుజురాబాద్ మండల పద్మశాలి సంఘం నాయకులు పరామర్శించి ప్రగాఢ సానుభూతి సంతాపం తెలిపి 50 కిలోల బియ్యం, వంటనూనె ప్యాకెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు సంగెం సత్యనారాయణ, జిల్లా కో కన్వీనర్ చిలుకమారి శ్రీనివాస్, హుజురాబాద్ పట్టణ పద్మశాలి సంఘం నాయకుడు ఇప్పలపల్లి చంద్రశేఖర్, చేనేత ఐక్యవేదిక డివిజన్ అధ్యక్షుడు కుడికాల సాయి, నాయకులు మంద బిక్షపతి, ఇప్పకాయల సాగర్, ధర్మరాజు పల్లి పద్మశాలి సంఘం అధ్యక్షులు, ఇప్పలపల్లి శ్రీనివాస్, వడ్డేపల్లి సాయి, పద్మశాలి కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు
Post Views: 378











