హుజురాబాద్/ అక్టోబర్ 02(మా అక్షరం): పట్టణంలోని సబ్ జైల్ లో గాంధీ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం సబ్ జైల్ పర్యవేక్షణ అధికారి దేవేందర్ అధ్యక్షతన గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పిడిఎం కోర్టు న్యాయమూర్తి అలేఖ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు… అనంతరం ఆమె మాట్లాడుతూ… క్షణికావేశంలో చేసిన తప్పులు సరిదిద్దుకొని సన్మార్గంలో నడుచుకోవాలని తద్వారా సమాజ శ్రేయస్సుకు దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ తిరుమల్, మానవ హక్కుల పరిరక్షణ కమిటీ అధ్యక్షులు సత్యం గౌడ్, సబ్ జైల్ సిబ్బంది, రిమైండ్ ముద్దాయిలు తదితరులు పాల్గొన్నారు
Post Views: 71











