హుజురాబాద్/ జనవరి 27 (మా అక్షరం): యువకులు ప్రేమ, చెడు వ్యసనాల బారిన పడి వారి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని నేపథ్యంలో అతిపిన్న వయసులోనే లస్ట్రస్ లవ్ అనే పుస్తకాన్ని ఇంగ్లీషులో రాసి వరల్డ్ బుక్, మహాత్మా గాంధీ నేషనల్ అవార్డు పొంది హుజురాబాద్ పట్టణానికి వన్నెతెచ్చాడు. వివరాల్లోకెళ్తే హుజరాబాద్ మండలంలోని పెద్ద పాపయ్యపల్లి గ్రామానికి చెందిన వడ్లూరి సుదర్శన్ కుమారుడు వడ్లూరి వేధార్థ ఎస్సార్ కాలేజీ నందు బీటెక్ ద్వితీయ సంవత్సరం అభ్యసిస్తున్నాడు.18 ఏళ్లకే ఈ విద్యార్థి ఈ మధ్య కాలంలో చాలా మంది విద్యార్థులు చేడు వ్యసనాలకు బానిసలై, ప్రేమలు విఫలమై ఆత్మ హత్యలు చేసుకొంటున్నారని, ఇలాంటి యువతకు మనో ధైర్యం ఇచ్చి వారిని మంచి మార్గములో వెళ్ళేవిధంగా వేదార్థ ఇంగ్లీష్ భాష లో కవితల రూపకంలో పుస్తకము రాసినాడు. ఇంత చిన్నవయసులో తెలంగాణ తోపాటు భారత దేశంలోనే అతి చిన్నవయసు లో మంచి పుస్తకం రాసినందుకు గాను ఇటీవల వరల్డ్ బుక్ రికార్డు వారు అతన్ని పిలిపించి ఈనెల 19 న రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ నందు అవార్డు ప్రదానం చేశారు. అలాగే రవీంద్రభారతి లొ కూడా పెద్దలు సత్కరించారు. మన పట్టణానికి చెందిన వేధార్థ ఇలాంటి అవార్డు పొందటం పట్ల అతని పెదనాన్న మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్లూరి విజయ్ కుమార్ తో పాటు పలువురు టిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల తోపాటు హుజరాబాద్ పట్టణంలోని పలువురు అభినందిస్తున్నారు.











