+91 99635 77856

గంజాయి అక్రమ రవాణా,గంజాయి కేసులలో నిందుతులుగా ఉన్న వారిపై పటిష్ట నిఘా

– జిల్లాలో విస్తృతా గంజాయి కిట్ల సహాయంతో యూరిన్ టెస్ట్ లు…
– జిల్లాలో 22 కేసులలో 48 మందిని అరెస్ట్ చేసి 2.200 గ్రాముల గంజాయి,12 గంజాయి మొక్కలు స్వాధీనం…
– రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్..
సిరిసిల్ల/ ఫిబ్రవరి19(మా అక్షరం):రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంజాయి అక్రమ రవాణా,గతంలో గంజాయి కేసులలో నిందుతులుగా ఉన్నవారిపై నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, గంజాయి కిట్ల సహాయంతో, నార్కోటిక్ జాగిలాలతో స్పెషల్ డ్రైవ్ లు ఏర్పాటు చేసి ఈ సంవత్సరం 22 కేసులలో 48 మందిని అరెస్ట్ చేసి 2.200 గ్రాముల గంజాయి,12 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని,జిల్లాలో గంజాయి విక్రయించిన,సాగు చేసిన, రవాణా చేసిన, సేవించిన వారి సమాచారం ఆర్. ఎస్ – నాబ్ 8712656392 నంబర్ కి అందించలని జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి జిల్లా పోలీస్ విన్నూత కార్యక్రమలు చేపడుతూ ప్రజల్లో అవగాహన కల్పింస్తుదని, జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై స్పెషల్ డ్రైవ్ లు,నార్కోటిక్ జగిలాలతో తనిఖీలు చేపడుతూ గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపడం జరుగుతుదన్నారు.గంజాయి అక్రమ రవాణాపై,గతంలో గంజాయి కేసులలో నిందుతులుగా ఉన్నవారిపై నిఘా ఉంచి గంజాయి కిట్ల సహాయంతో యూరిన్ టెస్ట్ లు నిర్వహించి గంజాయి సేవించే వారిని వారికి గంజాయి అందించే వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నామన్నారు.జిల్లాలో గంజాయి విక్రయించిన,సాగు చేసిన, రవాణా చేసిన సేవించిన వారి సమాచారం ఆర్. ఎస్ – నాబ్ 8712656392 నంబర్ కి అందించలని,సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడంజరుగుతుదని,గంజాయి కి అలవాటు పడిన వారిని పోలీస్ డి ఆడిక్షన్ సెంటర్ లో కౌన్సెలింగ్ కోసం పై నంబర్ ని సంప్రదించవచ్చని జిల్లా ఎస్పీ తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !