+91 99635 77856

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ప్రణవ్..

హుజురాబాద్/ ఏప్రిల్ 17 (మా అక్షరం): పేద కుటుంబంలో ఉండి పరిస్థుతులు బాగోలేక ఆసుపత్రుల పాలైన వారిని సీఎంఆర్ఎఫ్ చెక్కుల రూపంలో ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు వరసలో ఉంటుందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.గురువారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 5 మండలాలు,2 పట్టణాలకు సంబంధించిన 183 లబ్దిదారులకు,76 లక్షల విలువచేసే చెక్కులను లబ్దిదారులకు స్వయంగా ప్రణవ్ అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ… చెక్కులు వచ్చిన వెంటనే లబ్దిదారులకు అందజేస్తున్నామని,వారు వెంటనే బ్యాంక్ లో డిపాజిట్ చేసుకోవాలని సూచించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిననాటినుండి 1,500 కోట్ల పై చిలుకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశామని,అర్హులైన లబ్ధిదారులకు ఆదుకోవడంలో రాజకీయాలకతీతంగా ఉంటామని,సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో పార్టీ కార్యాలయానికి వచ్చిన వెంటనే అధికారులకు పంపించి చెక్కులు త్వరగా వచ్చేలా కృషి చేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !