హుజురాబాద్ /జూలై 20 (మా అక్షరం): యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ (టీజీపీఈ జేఏసీ) నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు హుజురాబాద్ టౌన్ సెక్షన్కు చెందిన విద్యుత్ ఉద్యోగులు సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలను బలోపేతం చేయాలని, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను ప్రైవేటీకరించే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యోగుల హక్కులు, ప్రజా ప్రయోజనాలను పరిరక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు
Post Views: 102












