+91 99635 77856

దళిత బంధు పై రాజకీయాలు మానుకోవాలి

కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సొల్లు బాబు
కరీంనగర్ జిల్లా/ హుజురాబాద్:దళిత బంధు పై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, దళిత బంధు పై రాజకీయాలు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సొల్లు బాబు హెచ్చరించారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…హుజురాబాద్ నియోజకవర్గం లో దళిత బంధు పథకం ఆగడానికి కారణం ప్రస్తుత ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అని, కావాలనే దళితులను రెచ్చగొడుతూ రాజకీయం చేస్తున్నారని పేర్కొన్నారు. దళిత బంధు పథకాన్ని బంద్ చేసిందే బీఆర్ఎస్ పార్టీ అని, అధికారంలో వాళ్లు ఉన్నప్పటికీ ఎందుకు దళిత బంధు డబ్బులను విడుదల చేయలేదని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో కావాలనే దళిత బంధు డబ్బులను బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆపడం జరిగిందని, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ విధులు సక్రమంగా చేయకుండా చేసి సెలవు పై వెళ్లే విధంగా చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీయే అని ధ్వజమెత్తారు. దళిత బంధు డబ్బులు విడుదల చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగానే ఉందని ఇలాంటి రాజకీయాలు చేయడం మానుకోవాలని హితువు పలికారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కొల్లూరి కిరణ్, మహిళ కాంగ్రెస్ పార్టీ పట్టణ, మండల అధ్యక్షురాళ్ళు యేముల పుష్పలత,లంకదాసరి లావణ్య,కాంగ్రస్ పార్టీ బిసి సెల్ నియోజకవర్గ చైర్మన్ కుర్ర శ్రీనివాస్ గౌడ్,మైనారిటీ పట్టణ అధ్యక్షులు యండి అఫ్సర్, జిల్లా ఉపాధ్యక్షురాలు ఆలేటి సుశీల,హనుమాన్ దేవాలయ కమిటీ చైర్మన్ కొలిపాక శంకర్, సోషల్ మీడియా ఇంచార్జీ మిడిదొడ్డి రాజు, ఆడేపు ఐలయ్య, బండారి సదానందం, రాంచంద్రం,టేకుల శ్రావణ్, జక్కుల రమేష్, నర్సింగ్,బోరగాల రాజయ్య,సోల్లు సునిత, చల్లూరి విష్ణువర్ధన్, యండి సాదిక్,యండి రియాజ్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !