కరీంనగర్ జిల్లా/హుజూరాబాద్: రామాయణంను రచించిన తొలి కవియిత్రిగా పేరుపొందిన రచయిత్రి ఆతుకూరి మొల్లమాంబ 584వ జయంతి వేడుకలు హుజూరాబాద్ పట్టణంలోని జమ్మికుంటరోడ్లో బుధవారం ఘనంగా నిర్వహించారు.తొలి తెలుగు కవయిత్రి రామాయణం రచయిత్రి ఆతుకూరి మొల్లమాంబ 584వ జయంతి వేడుకల్లో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక శ్రీనివాస్,వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల శ్రీనివాస్ పాల్గొని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధి కుమ్మరి సంఘం నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కుమ్మరులకు కుమ్మర ఫెడరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి మండలానికి ఎకరం భూమి కుమ్మర సొసైటీలకు కుటాయించి కుమ్మర వృత్తిని కాపాడాలన్నారు.ఆతుకూరి మొల్ల జీవిత కాలం గురించి భిన్నాభిప్రాయాలున్నప్పటికి శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవులలో ఒకరని కూడా నమ్ముతారన్నారు. తన పద్యంలో పేర్కొన్న కారణంగా ఆమె రాయలవారి సమయానికి చెందిన కవయిత్రిగా కొందరు భావిస్తున్నారన్నారు. ఆమె రచనలను, దేశ భక్తిని గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ మక్కపల్లి కుమార్ యాదవ్, ప్రజాప్రతినిధి కుమ్మరి సంఘం నియోజకవర్గ ఇన్చార్జి నాంపల్లి ప్రభాకర్, కుమ్మరి సంఘం నియోజకవర్గ కార్యదర్శి ఇజ్జగిరి కుమార్, ప్రజాప్రతినిధి కుమ్మరి సంఘం పట్టణ అధ్యక్షులు మోతె రవి, కమలాపూర్ మండల అధ్యక్షులు సముద్రాల సదానందం,పట్టణ కోశాధికారి మోతే రాజు,చెల్పూర్ శ్రీనివాస్, నాంపల్లి రాజు,మోతె తిరుపతి,ఇజ్జిగిరి చంద్రమౌళి,ఇజ్జిగిరి దేవేందర్,దుంపేటి రమేష్, కందికొండ తిరుపతి,మోతె మొగిలి,మోతె రాజయ్య,ఇజ్జిగిరి శ్రీను,సంపంగి రాజేందర్, బత్తుల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.











