+91 99635 77856

మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

-ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలింపు…
-ఎమ్మెల్యేకు పలువురి అభినందనలు…

హుజరాబాద్/ఏప్రిల్ 24(మాఅక్షరం): నియోజకవర్గంలో బుధవారం వివిధ వివాహ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రమాదంలో గాయపడ్డ యువకుడిని గుర్తించి దగ్గరుండి ఆసుపత్రికి పంపించి మానవత్వం చాటుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.

నియోజకవర్గంలోని పలు వివాహ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఓ వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు మర్రిపల్లి గూడెం నుంచి కన్నూరుకి వెళ్తుండగా మార్గమధ్యంలో ట్రాక్టర్ ఢీకొని మధు అనే యువకుడు తీవ్రంగా గాయపడటాన్ని గమనించిన ఎమ్మెల్యే తన కాన్వాయ్ ని వెంటనే ఆపారు. హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి ప్రమాదంలో గాయపడ్డ మధుని తానే స్వయంగా పట్టుకొని మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ఫోన్ చేసి చికిత్స అందించాల్సిందిగా డాక్టర్ ను విజ్ఞప్తి చేశారు.అనంతరం బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పి మెరుగైన వైద్యం అందించడానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు.ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మానవతా దృక్పథానికి నియోజకవర్గంలోని ప్రజలంతా అభినందనలు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !