హుజురాబాద్/ జూన్ 19 (మా అక్షరం): దేశ సేవ కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా త్యాగాలు చేసిన గొప్ప కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబం అని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితల ప్రణవ్ అన్నారు.కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్బంగా బుధవారం పట్టణం లోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ కేక్ కటింగ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు పటాసులు కాల్చి సంబరాలుచేసుకున్నారు.అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయిన మహిళలకు వోడి తల ప్రణవ్ కాంగ్రెస్ నాయకుల తో కలిసి బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో కల్పిస్తున్న వసతులు, ఆస్పత్రి వైద్య సిబ్బంది వివరాలు తెలుసుకొని మరింత మెరుగుగా వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.











