హుజురాబాద్/ జూన్ 12 (మా అక్షరం): సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) సభ్యుడిగా నియమితులైన సబ్బని రమేష్ను తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలుకమారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్, తెలంగాణ ఫిలిం అసోసియేషన్ స్టేట్ ఆర్గనైజర్ సందెల వెంకన్న మాట్లాడుతూ, రెండు దశాబ్దాలుగా బీజేపీకి సేవలందిస్తున్న రమేష్కు ఈ పదవి దక్కడం హుజురాబాద్కు గర్వకారణమన్నారు. ఫిలిం బోర్డు సభ్యుడిగా మంచి చిత్రాలకు ప్రోత్సాహం అందించి ఉత్తమ గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సబ్బని రాజేందర్, ఇప్పకాయల సాగర్, మార్త రవీందర్, కుడికాల ప్రభాకర్, గాలి సమ్మయ్య, తాటిపాముల దేవేందర్, కె.ఆర్. బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
Post Views: 194












