-వర్షంలోనూ వార్డు సమస్యల పరిష్కారం..
-అభినందించిన వార్డ్ ప్రజలు
హుజరాబాద్/ జూలై 21(మా అక్షరం): 23 వ వార్డు ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినా ఆపద ఉన్న నేనున్నానంటూ వార్డ్ కౌన్సిలర్ మొలుగు సృజనా పూర్ణచందర్ ఆపద్బాంధవునిలా ఉంటూ ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తాడు. ఇందులో భాగంగానే గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కొడుతున్న వర్షాలతో 23 వార్డ్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని తెలుసుకున్న పూర్ణచందర్ ఆదివారం వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గంటల తరబడి వార్డులలో తిరుగుతూ నీటి సమస్య ఉన్న ప్రాంతాన్ని గుర్తించి నివారణ చర్యలు మొదలుపెట్టాడు. వార్డులో కొన్ని ప్రాంతాల్లో జలమయం కావడంతో మున్సిపల్ అధికారులకు విషయాన్ని తెలిపి జేసీబీ సహకారంతో తాను కూడా ప్రత్యక్షంగా పాల్గొని జలమయమైన ప్రాంతాల్ని నీళ్ళు నిలవకుండా చేశారు. వార్డు ప్రజలకు ఎప్పుడు ఏ అవసరమొచ్చిన ముందుండే పూర్ణచందర్ మరోసారి ప్రజల సమస్యను పరిష్కరించడంతో వాడు ప్రజలు అభినందనలు తెలిపారు.











