హుజురాబాద్/జులై 26(మా అక్షరం): పట్టణంలోని సిద్ధార్థ నగర్ కాలనిలో గోరింటాకు వేడుకను శుక్రవారం మహిళలు ఘనంగా నిర్వహించుకున్నారు. మహిళలు అతి పవిత్రంగా భావించే ఆషాఢమసాన్నీ పురస్కరించుకొని కాలనిలోని మహిళలందరు ఒక్కచోట చేరి ఒకరికొకరు తమ చేతులకి గోరింటాకుతో అందంగా అలంకరించుకున్నారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షుడు సతీమణి సాగి వనజ మాట్లాడుతూ..పురాణాల ప్రకారం గోరింటాకుకు గౌరి దేవికి ఎంతో అవినాభావ సంబంధం ఉందని అన్నారు. నాటి నుండి నేటి వరకు మహిళలు ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారని,గోరింటాకు కేవలం మహిళలకు అందానికే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకురుస్తుందని, ప్రత్యేకించి మహిళల సౌభాగ్యానికి చిహ్నంగా భావిస్తారని, భావితరాలకి ఈ సాంప్రదాయాన్ని తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వనజ అన్నారు.ఈ కార్యక్రమంలో మాడ సమతరెడ్డి, పెద్ది ప్రసూనారెడ్డి, సాగి ప్రియాంక, మాడ భాగ్యలక్ష్మి, కేతిరి ప్రసన్నరెడ్డి, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.











