హుజురాబాద్/ఆగస్టు01(మా అక్షరం): పట్టణ సిఐ గా జి.తిరుమల్ నియమితులయ్యారు. మల్టీ జోన్ వన్ పరిధిలో పనిచేస్తున్న 13 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఐజిపి చంద్రశేఖర్ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.ఇక్కడ సిఐగా పనిచేస్తున్న బొల్లం రమేష్ ను కరీంనగర్ సిసిఎస్ కు, సిఎస్బి 3 లో పని చేస్తున్న తిరుమల్ ను హుజురాబాద్ కు, బదిలీ చేశారు. కాగా బొల్లం రమేష్ ఇదివరకే బదిలీ అయ్యారని పలు పత్రికలలో రావడం తర్వాత బదిలీ కాకపోవడంతో కొన్ని రోజులు బొల్లం రమేష్ బదిలీపై ఎందుకు వెళ్లడం లేదని, కొందరేమో రాజకీయ పలుకుబడి తోటి వెళ్లిపోవడం లేదని, కొందరు పై అధికారుల అండదండలతో హుజురాబాద్ లోని ఉండిపోతారని పలువురు చర్చించుకోవడం జరిగింది.
Post Views: 541











