-ప్రతి ఇంటిలో చెత్త, చెదారం లేకుండా చూసుకోవాలి…
-మున్సిపాలిటీలోని పట్టణాలు,గ్రామాల్లో పారిశుధ్యం పై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టండి…
-మిషన్ భగీరథ ట్యాంకులను,గ్రామాల్లో నీటి సరఫరా చేసే ట్యాంకుల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టండి..
– ప్రభుత్వం ప్రవేశ పెట్టిన స్వచ్చదనం-పచ్చదనం కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ పాల్గొనాలి..
-పట్టణాలు,గ్రామాల్లో పారిశుద్ధంపై, త్రాగునీరుపై, అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని హుజురాబాద్ నియోజవర్గ మున్సిపల్ అధికారులను,మండల ఎం.పి.డి.ఓ అధికారులకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి వోడితల ప్రణవ్ కోరారు…
హుజురాబాద్/ఆగస్టు11(మా అక్షరం): వర్షాకాలం సందర్భంగా మున్సిపల్ పట్టణాలలో, గ్రామాలలో డెంగ్యూ,మలేరియా లాంటి సీజనల్ జ్వరాలు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని,ఆ భాధ్యత హుజురాబాద్ ,జమ్మికుంట మున్సిపాలిటీ కమిషనర్ లు, ఆయా మండలాల ఎంపిడిఓలు తీసుకోవాలని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ప్రతీ ఒక్కరూ ఇంటి పరిసరాల్లో చెత్త,నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.అంతేకాకుండా గ్రామాల్లో పారిశుధ్యంపై ఎంపిడిఓలు ఆయా శాఖల అధికారులతో సమన్వయ పరుస్తూ ప్రత్యేక దృష్టి పెట్టాలని,మిషన్ భగీరథ ట్యాంకులను,గ్రామాల్లో నీటి సరఫరా చేసే ట్యాంకులను శుభ్రంగా ఉంచుకోవాలనీ ప్రణవ్ సూచించారు.వీలైనంత వరకు ప్రజలకు అవగాహన కల్పించేలా చేయాలనీ కోరారు.వర్షాకాలం ప్రభుత్వం స్వచ్చదనం-పచ్చదనం కార్యక్రమం పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు











