ఎల్కతుర్తి/ఆగస్టు16(మా అక్షరం): మండలం లోని వల్బ్ పూర్ గ్రామ శ్రీ పశుపతినాథ్ స్వామి దేవాలయం శ్రీ క్రోది నామ సంవత్సరం ధక్షణయానం వర్షఋతువు శ్రావణ శుక్రవారము పర్వదినాన్ని పురస్కరించుకొని శివాలయ అర్చకులు శ్రీ సదానిరంజన్ సిద్ధాంతి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉదయం 6 గంటల నుండి గణపతి పూజ శ్రీ పశుపతినాథ్ స్వామివారికి పంచామృత సహిత రుద్రాభిషేకలు, శ్రీ గౌరీ అమ్మవారికి దుర్గాసూక్త విధనేనా పంచామృత సహిత అభిషేకాలు, సామూహిక వరలక్ష్మి వ్రతము నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గంజి భావనారుషి విజయ శ్రీ, సంపత్ అనితా, కుమార్ స్వర్ణలత, రాజేశ్వర రావు సరోజన, కిషోర్ పద్మ, బాబూ స్వరూప, నవీన్ మౌనిక, అంజలి, లయ శ్రీ, వర్ష వర్థిని, శ్రీ నిధి, స్వామి రేణుక, స్వామి రామ భక్తులు గ్రామస్థులు పాల్గొన్నారు.
Post Views: 240











