ఎల్కతుర్తి/ ఆగస్టు18(మా అక్షరం): మండలంలోని పెంచికల్ పేట గ్రామంలో గౌడ సంఘ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 వ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ… బహుజనులకు అండగా నిలబడి పోరాడిన గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. గ్రామంలోని గౌడ సంఘ సభ్యులు సబ్బండ వర్గాల వారు పూలమాలలు వేసి అంగరంగ వైభవంగా నివాళులర్పించి, అతని సేవలను కొనియాడారు. జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించడంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘ అధ్యక్షులు, డైరెక్టర్లు సభ్యులు, వివిధ కుల సంఘం నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Post Views: 85











