ఎల్కతుర్తి/ ఆగస్టు 19(మా అక్షరం):
మండలంలోని వల్బాపూర్ గ్రామంలో
శ్రీ పశుపతినాథ్ స్వామి దేవాలయంలో శ్రీ క్రోది నామ సంవత్సరం ధక్షణయానం వర్షఋతువు శ్రావణ సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకొని శివాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉదయం 6 గంటల నుండి మహా మంగళ గణపతి పంచామృత అభిషేకం నందీశ్వరునికి అభిషేక పూజ శ్రీ పశుపతినాథ్ స్వామివారికి పంచామృత సహిత రుద్రాభిషేకలు బిల్వార్చనలు శ్రీ గౌరీ అమ్మవారికి దుర్గాసూక్త విధనేనా పంచామృత సహిత అభిషేకాలు నిర్వహించి తీర్థప్రసాద వితరణ చేసామని ఆలయ అర్చకులు శ్రీ సదానిరంజన్ సిద్ధాంతి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గంజి భావనారుషి విజయ శ్రీ, రామరావు రామదేవి , రాజేశ్వర్ రావ్ రజిత, విజయ్ స్వాతీ, సంపత్ రావు మంజుల, రత్నాకర్ రావ్ సుశీల, కరుణాకర్ సుమా, విజయ, చైత్ర,భక్తులు గ్రామస్థులు పాల్గొన్నారు
Post Views: 222











