+91 99635 77856

జర్నలిస్టుల నివేషణ స్థలాల సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖ…

హుజురాబాద్/ఆగస్టు22(మా అక్షరం): నియోజకవర్గం లో పనిచేస్తున్న హుజురాబాద్ మండల జర్నలిస్టులకు కేటాయించిన నివేషణ స్థలంలో కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలంటూ సమస్యలతో కూడిన వినతి పత్రము లేఖను ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం పోస్టల్ కార్యాలయంలో పోస్ట్ చేశారు.

ఈ సందర్భంగా కో- కన్వీనర్లు కాయిత రాములు, నాయకుడు నిమ్మటూరు సాయికృష్ణ మాట్లాడుతూ… 20 సంవత్సరాల నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ జర్నలిస్టు వృత్తిని కొనసాగిస్తున్నామని అన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వంలో కలెక్టర్ ఆదేశాలతో పట్టాలు వచ్చాయని,అందులో నిర్మాణాలు కూడా పూర్తి చేశామని దానిపై పూర్తిస్థాయిలో ముఖ్యమంత్రి ఈఎన్ సీ ఇవ్వాలని కోరుతూ లేక పంపించామన్నారు.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు చిలుకమారి సత్యరాజ్, కేదాసి శ్రీధర్, సమ్మెట సతీష్, పబ్బ తిరుపతి, గోపగోని మహేష్, ఎడ్ల కుమార్, మహ్మద్ అబ్దుల్ ఫహిం తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !