హుజురాబాద్/ సెప్టెంబర్14(మా అక్షరం): జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తుమ్మెటి సమ్మెరెడ్డి మరణించారు. శుక్రవారం రోజున రాత్రి గుండె పోటు రావడంతో కుటుంబ సభ్యులు జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా,చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతికి కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ ఇన్చార్జి వొడితల ప్రణవ్ సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Post Views: 297











