హుజురాబాద్/సెప్టెంబర్20(మా అక్షరం): మండలం లోని రాంపూర్ గ్రామానికి చెందిన వేముల లక్ష్మణ్ ఎస్సై ట్రైన్ పూర్తి చేసుకుని తన గ్రామానికి వచ్చిన సందర్భంగా శుక్రవారం ఆయనను పద్మశాలి సంఘం నాయకులు ఘనంగా సత్కరించారు. పేద కుటుంబానికి చెందిన లక్ష్మణ్ తండ్రి రాజేశం లేకపోయినా తల్లి అరుణ ఆశయ సాధన కోసం కష్టపడి కానిస్టేబుల్ గా కొన్ని రోజులు పనిచేసే తర్వాత ఎస్సైగా సెలెక్ట్ అయి ఉద్యోగం పొందడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు సంగెం సత్యనారాయణ, జిల్లా కో కన్వీనర్ చిలుకమారి శ్రీనివాస్, జిల్లా కన్వీనర్ అడిచెర్ల శ్రీనివాస్, పోరండ్ల రమేష్ ,బండారి సదానందం, గ్రామ అధ్యక్షులు ముషం గణేష్,మాజీ సర్పంచ్ చేరాల మనోహర్,నాయకులు చేరాల హరికృష్ణ, కొక్కుల సమ్మయ్య,కూరపాటి రామచంద్రం, జడల అశోక్,కుడికాల సాయి,ఇప్పలపల్లి చంద్రశేఖర్,మంద బిక్షపతి,తదితరులు పాల్గొన్నారు.











