+91 99635 77856

ఘనంగా ఎన్ఎస్ఎస్ జాతీయ సేవా పథకం ఆవిర్భావ వేడుకలు..

హుజురాబాద్/సెప్టెంబర్ 24 (మా అక్షరం): పట్టణం లోని శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ జాతీయ సేవా పథకం ఆవిర్భావ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ ఏనుగు మైపాల్ రెడ్డి మాట్లాడుతూ… యువత సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని, చదవడం కాకుండా సమాజం పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రిన్సిపల్ ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ ఉత్తమ విద్యార్థులుగా ఎదగాలంటే క్రమశిక్షణ నాయకత్వ లక్షణాలు పట్టుదల త్యాగం శీలం విద్యార్థులకు పట్టుకొమ్మలు నేటి యువతరం దేశ భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ తెలుగు అధ్యాపకులు మేకల నవీన్ కుమార్ ఎన్ఎస్ఎస్ గురించి ఎన్ఎస్ఎస్ గీతానాలపించారు.ఎన్ఎస్ఎస్ సేవా భావాల గురించి క్షుణ్ణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో భద్రయ్య,తిరుపతి,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !