+91 99635 77856

ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరిన బుర్ర కుమార్

హుజురాబాద్/అక్టోబర్02(మా అక్షరం): నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో 28వ వార్డుకు చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకుడు బుర్ర కుమార్ గౌడ్ బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ప్రణవ్ బాబు బుర్ర కుమార్ కు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో క్రమశిక్షణతో నడుచుకొని పార్టీ అభివృద్ధి కోసం పనిచేసే నాయకులకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సొల్లు బాబు‌, మహిళా అధ్యక్షురాలు యేముల పుష్పలత, జిల్లా నాయకుడు మేకల తిరుపతి, సీనియర్ నాయకులు కాజీపేట శ్రీనివాస్, తాళ్లపల్లి రమేష్ గౌడ్, సొల్లు దశరథం, ప్రతాప నాగరాజు పటేల్, ఉప్పు శ్రీనివాస్ పటేల్ ల ఆధ్వర్యంలో పార్టీలో చేరడం జరిగిందని కుమార్ తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !