+91 99635 77856

వేలేరు పోలీసుల అదుపులో ఇద్దరు యువకులు!?

-గంజాయి విక్రయదారులతో సంబంధాలే కారణమంటూ పోలీసుల అదుపులో ఉన్నారంటూ ప్రచారం…
-కానీ వేలేరు పోలీసులు మాత్రం మాటూరి తరుణ్ మారుతి నగర్, హుజురాబాద్ గా గుర్తించారు..
-అసలు వేలేరు,టాస్క్ ఫోర్స్ హుజురాబాద్ కు సంబంధించిన వ్యక్తులను ఇద్దరిని అరెస్టు చేశారా? లేక ఒకరిని అరెస్టు చేశారా? అనేది తెలియాల్సి ఉంది..
హుజురాబాద్/అక్టోబర్ 26(మా అక్షరం): పట్టణంలో రెండు రోజులుగా ఇద్దరు వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అర్ధరాత్రి వచ్చి వేలేరు పోలీస్ స్టేషన్ సంబంధించిన పోలీసుల మంటూ వారి కుటుంబ సభ్యులకు తెలిపి తీసుకుపోయారంటూ జరిగిన సంఘటన విధితమే… కానీ వేలేరు పోలీస్ స్టేషన్లో ఈరోజు స్థానిక ఎస్సై పాత్రికేయులకు ఒక ప్రకటన వెల్లడించారు. స్థానిక పోలీసులతోపాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు కలిసి వేలేరు బస్టాండ్ లో తనిఖీలు నిర్వహించగా మాటూరి తరుణ్ మారుతీ నగర్ హుజరాబాద్ అనే వ్యక్తి దగ్గర నుంచి గంజాయి 410 గ్రాములు డబ్బులు 8900 ఒక సెల్ ఫోన్ అదుపులోకి తీసుకున్నట్లు సిఐ తెలిపారని తెలిసింది. కానీ హుజురాబాద్ లో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారని చర్చి జరుగుతుండగా… వేలేరు పోలీసులు మాత్రం ఒక వ్యక్తిని మాత్రమే గంజాయిని సరఫరా చేస్తుండగా అదుపులోకి తీసుకున్నామని తెలుపడంతో పలు అనుమానాలకు వస్తున్నాయంటూ పలువురు చర్చించుకుంటున్నారు. మరి వెంకటేష్ అనే వ్యక్తిని ఎవరు తీసుకుపోయారని కుటుంబీకులు ఆందోళన గురవుతున్నారు. అసలు వెంకటేష్ అనే వ్యక్తి ఎవరి అదుపులో ఉన్నారు అని తెలిసింది ఉంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !