– ఎస్ఐ యూనస్ అహ్మద్ అలి..
హుజురాబాద్/ అక్టోబర్ 26(మా అక్షరం) పట్టణానికి చెందిన పీవీ సేవా సమితి నిర్వహిస్తున్న సేవలు అభినందనీయమని ఎస్సై అలీ అన్నారు.పట్టణంలోని సిద్దర్థానగర్ కాలనీలో ఐ ఎం ఏ వైద్యులతో ఉచిత వైద్య శిబిరం శనివారం నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్య్రమానికి ఎస్ఐ అలీ ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడుతూ… వాతావరణంలో వస్తున్న మార్పులు, కలుషిత ఆహారం సేవించడం వలన ప్రజలు వ్యాధుల బారిన పడి ఆర్థికంగా చితికి పోవడమే కాక, డెంగీ లాంటి జ్వరాలతో ప్రాణాపాయ స్థితిలోకి వెళుతున్నారని ప్రజలకు సూచించారు. ఇలాంటి స్వచ్చంధ సంస్థలు ముందుకు వచ్చి ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వ్యక్తిగత శుభ్రతతొ పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని హితవు పలికారు. సీనియర్ వైద్యులు డా: రామలింగ రెడ్డి, డా:తొగరు విద్యాసాగర్ వైద్య సేవలందించారు. ఆర్కే కన్నయ్య, ఏ టు జెడ్ మెడికల్ దొండ నాగరాజు మందులు పంపణీ చేసారు. ఈ కార్య్రమంలో పీవీ సేవా సమితి అధ్యక్షులు తూము వెంకట్ రెడ్డి, సిదార్థనగర్ కాలని అధ్యక్షులు వీరభద్ర రావు, B. మనోజ్, విశ్రాంత ఉపధ్యాయులు PD రాజి రెడ్డి, K.సదానందం, గొల్లపల్లి రవిందర్, మాడ రాజి రెడ్డి, V. సురేందర్ రావు, శివ ప్రసాద్ రావు, నమశ్శివాయ, అంబరీష్, శ్రీకాంత్, రఘునాధం తదితరులు పాల్గొన్నారు..











