హుజురాబాద్/అక్టోబర్ 26(మా అక్షరం): మండలంలోని రంగాపూర్ గ్రామ శివారులో పేకాట స్థావరంపై శనివారం పోలీసులు దాడులు చేసినట్లు హుజురాబాద్ టౌన్ సిఐ తిరుమల్ గౌడ్ తెలిపారు. పక్కా సమాచారంతో హుజురాబాద్ ఎస్సై యూనస్ అహ్మద్ అలీ సిబ్బంది తో కలిసి పేకాట ఆడుతున్న స్థావరం వద్దకు వెళ్లగా పేకాట ఆడుతున్న 9 మందిలో ఐదుగురు పారిపోగా నలుగురిని పట్టుకొని వారి దగ్గర నుండి 11,280 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
Post Views: 160











