హుజురాబాద్/ అక్టోబర్ 30 (మా అక్షరం): మండలం లోని రాంపూర్ గ్రామానికి చెందిన మాడ్గుల ఓదెలుకు అంబేద్కర్ నేషనల్ అవార్డు లభించింది. హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఈ అవార్డును అందించారు. గత 30 సంవత్సరాలుగా మాడ్గుల ఓదెలు అంబేద్కర్ సంఘాల్లో పనిచేస్తూ బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడ్డాడు.దళితుల్లో నెలకొన్న ఎన్నో సమస్యలను అధికారుల ద్వారా పరిష్కరించేందుకు కృషి చేశారు.ఆయన సేవలను గుర్తించి బహుజన సాహితీ అకాడమీ ఈ అవార్డును అందించింది. ఈ సందర్భంగా మాడ్గుల ఓదెలు మాట్లాడుతూ.. అంబేద్కర్ నేషనల్ అవార్డు రావడం తనపై మరింత బాధ్యతను పెంచిందన్నారు. మునుముందు బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం ఉత్సాహంగా పనిచేస్తానని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను అన్నారు.











