– కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోరపెల్లి రమణారెడ్డి..
కరీంనగర్, తిమ్మాపూర్/అక్టోబర్ 31(మా అక్షరం): మండలం లోని మన్నెంపల్లి గ్రామంలో గురువారం ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోరపెల్లి రమణారెడ్డి మాట్లాడుతూ…..దేశ ప్రదానులలో మహిళా ప్రధానిగా గరీబీ హటావో అనే నినాదంతో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చి ఉక్కు మహిళగా వెనుకడుగు వేయకుండా భారత దేశాన్ని ప్రథమ స్థానంలో నిలబెట్టిన ఘనత ఇందిరాగాంధీదే అని ఆ రోజుల్లో మారుమూల ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం లేకున్నా మహిళలు చదువుకోవాలనే ఉద్దేశంతో వెనుకబాటుకు గురైన ప్రజల్లో చైతన్యం నింపారని, అటువంటి గొప్ప మహిళా 1984 అక్టోబర్31న తన అంగరక్షకుల చేతిలో హత్యగావింపబడగా ప్రజలు శోక సంద్రంలో మునిగిపోయారని,ఆమే మరణించిన తరువాత కూడా రాజీవ్ గాంధీ,పి.వీ నరసింహరావు, మన్మోహన్ సింగ్ లాంటి వారు దేశాన్ని ప్రపంచ స్థాయిలో నిలబేట్టడంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య పాత్ర పోషించిందని, కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రతీ నాయకుడు, ప్రతీ కార్యకర్త ఇందిరాగాంధీ ఆశయసాధనలు కొనసాగించేందుకు కృషి చేయాలని కోరారు.అనంతరం వృద్దులకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమం లో తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మండల పార్టీ సీనియర్ నాయకులు,గ్రామా శాఖ అధ్యక్షులు, అనుబందాశాఖలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.











