– నియోజకవర్గ ప్రజలందరు సుఖసంతోషాలతో ఉండాలి….
– దీపావళీ కాంతులవలె ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి…
-కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గం వొడితల ప్రణవ్…
హుజురాబాద్/ అక్టోబర్ 31(మా అక్షరం): నియోజకవర్గం లోని ప్రజలందరి జీవితాల్లో ఈ దీపావళి వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.ప్రతీ ఇంట్లో ఆనంద దీపాలు వెలగాలని,వారి జీవితాల్లో వేల కాంతులు నింపాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.అలాగే టపాకాయలు పేల్చే సమయంలో చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండాలని,ప్రమాదం జరగకముందే ఆన్ని జాగ్రత్తలు తీసుకొని,ఆనంద దీపావళినీ మరింత దేదీప్యమానంగా జరుపుకోవాలని కోరారు.
Post Views: 296











