కరీంనగర్,తిమ్మాపూర్/ నవంబర్04(మా అక్షరం): మండలంలోని పొలంపల్లి గ్రామానికి చెందిన బండపెల్లి మల్లేశం అనారోగ్యంతో బాధపడుతూ కరీంనగర్ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరగా పరిస్థితి తీవ్రం కావడంతో హైదరాబాద్ వెళ్ళాలి అని వైద్యులు సూచించగా, పొలంపల్లి మాజీ ఎంపీటీసీ బండారి రమేష్, అశీక్ పాషా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్ళగా స్పందించిన ఎమ్మెల్యే హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ ఆర్ఎంఓ తో మాట్లాడి మల్లేశంకు ప్రభుత్వం ద్వారా రూ.170,000 ఎల్ఓసి ఇప్పించారు.ఎల్ఓసిని మాజీ ఎంపీటీసీ రమేష్,ఆశిక్ పాషా హైదరాబాద్ లో చికిత్స పొందుతున్న మల్లెశంకు సోమవారం అందజేశారు.తనను ఆపదలో ఆదుకున్న ఎమ్మెల్యే కవ్వంపల్లికి, మాజీ ఎంపీటీసీ బండారి రమేష్, ఆశీక్ పాషా లకు మల్లేశం కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Post Views: 79











