+91 99635 77856

అద్దె భవనాల్లో ఇబ్బంది పడుతున్న విద్యార్థులు

– బీసీ బాలుర, బాలికల హాస్టళ్లకు నూతన భవనాలు నిర్మించే విధంగా ప్రభుత్వం, మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని..
-కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ కి ఏఐఎస్ఎఫ్ నాయకులు వినతి…

హుజూరాబాద్/ నవంబర్ 07(మా అక్షరం): నియోజకవర్గంలోని బిసి బాలుర, బాలికల హాస్టళ్లు అద్దె భవనాల్లో నడుస్తున్నాయని ప్రభుత్వం, మంత్రి దృష్టికి తీసుకెళ్లి నూతన భవనాలు నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ.. గురువారం అఖిల భారత విద్యార్థి సమాఖ్య( ఎఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ ఒడితల ప్రణవ్ బాబు కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామారపు వెంకటేష్ మాట్లాడుతూ… నియోజకవర్గంలో ఉన్న సంక్షేమ బిసి బాలుర, బాలికల హాస్టల్స్ అద్దె భవనాల్లో నడుస్తున్నాయని అలాగే నియోజకవర్గంలో గల వీణవంక గురుకుల సైదాపుర్ గురుకులాలు హుజురాబాద్ మండల కేంద్రంలో రైస్ మిల్లుల మధ్యలో ఉన్నాయని తెలిపారు. దీనివల్ల రైస్ మిల్లుల ద్వారా వచ్చే పోగా వలన చర్మ సమస్యలు శ్వాశకోశ సమస్యలు వస్తున్నాయని అలాగే బిసి, బాలికల సంక్షేమ హాస్టళ్లు మెన్ రోడ్డు పక్కన ఉన్నాయని విద్యార్థులు పాఠశాల కు వేళ్లి వచ్చే క్రమంలో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హాస్టళ్లలో చదివే విద్యార్థులు నిరుపేద కుటుంబాలకు చెందిన వారు కాబట్టి పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే అవకాశం ఉంది కనుక ప్రభుత్వం దృష్టికి, మంత్రి దృష్టికి తీసుకెళ్లి వేంటనే నూతన భవనాలు నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కేశబోయిన రాము యాదవ్, మండల అధ్యక్షుడు దోమ్మాటి వేణుగోపాల్, మండల సహాయ కార్యదర్శి రాంపేల్లి రోహిత్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !