+91 99635 77856

అవగాహన సదస్సు..

హుజరాబాద్/నవంబర్ 07(మా అక్షరం): పట్టణంలోని జడ్పీహెచ్ మండలంలోని రాంపూర్ పాఠశాలలో గురువారం జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం జిల్లా ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ రావు సూచన మేరకు డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాం” స్పృహ క్లబ్” ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు మత్తు పదార్థాలు వాటి వలన కలిగే నష్టాల గురించి పట్టణ ఎక్సైజ్ టి. శ్రీనివాస్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలుగా మారకుండా విలువలతో కూడిన జీవితాన్ని నిర్మించుకుంటూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్సై టి వినోద్ కుమార్, హెచ్ సి ముకుంద రెడ్డి, కానిస్టేబుల్ సంతోష్, రాజశేఖర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ.సమ్మిరెడ్డి, జే. ప్రదీప్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !