+91 99635 77856

పోగొట్టుకున్న మొబైల్ ను అందజేసిన ఎస్సై..

కరీంనగర్, తిమ్మాపూర్/ నవంబర్ 26 (మా అక్షరం):కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని మండల కేంద్రానికి చెందిన జర్నలిస్టు కొంపెల్లి సతీష్ పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ మంగళవారం అందజేసినట్లు ఎస్సై వివేకు తెలిపారు.ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన సతీష్ దాదాపు కొన్ని రోజుల క్రితం ఎల్ఎండి లోని ఎమ్మెల్యే క్యాంపు పరిసర ప్రాంతంలో పని ముగించుకుని బైక్ పై ఇంటికి వెళ్లే క్రమంలో తన మొబైల్ ఎక్కడో మిస్ అవ్వగా ఎంత వెతికిన ఆచూకీ లభించకపోవడంతో సీఈఐఅర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయగా వారి మొబైల్ ఫోన్ ను గుర్తించి దాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లు ఆయన తెలిపారు.ఎవరైనా సెల్ పోన్ పోగొట్టుకున్నట్లయితే వివరాలను సీఈఐఅర్ ఫోర్టల్ నమోదు చేస్తే ఫోన్లను గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎవరికైనా మొబైల్ ఫోన్లు దొరికితే వాటిని వెంటనే పోలీస్ స్టేషన్ లో అందించాలని ఎస్సై వివేక్ కోరారు. మొబైల్ తిరిగి తన చేతికి వచ్చినందుకు సిఈఐఆర్ పోర్టల్ చాలా ఉపయోగపడిందని తిరిగి మొబైల్ ను ఎస్సై చేతుల మీదుగా తీసుకోవడంతో వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !