+91 99635 77856

డిసెంబర్ 6 లోగా విగ్రహాలపై ముసుగులు తొలగించాలి…

తిమ్మాపూర్ జేఏసి డిమాండ్..

కరీంనగర్, తిమ్మాపూర్ /నవంబర్ 26 (మా అక్షరం):కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలకేంద్రంలోని అంబేద్కర్ భవన్లో మంగళవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించి నాయకులు నూతన జేఏసిని ఏర్పాటు చేసారు.ఈ సందర్భంగా మండలకేంద్రంలోని బస్ స్టేషన్ ముందు గత రెండేళ్ల క్రితం నెలకొల్పిన అంబేద్కర్, జగ్జీవన్ రాం విగ్రహాలపై ఉన్నటువంటి ముసుగులను డిసెంబర్ 6 లోగా తొలగించాలని డిమాండ్ చేస్తూ మహనీయుల విగ్రహాలపై ఉన్న ముసుగులను తొలగించడంలో జేఏసి తీసుకునే ప్రతీ నిర్ణయానికి ప్రతి సభ్యుడు కట్టుబడి పనిచేయాలని,విగ్రహాల ముసుగులను తొలగించేందుకు నిరసన కార్యక్రమాలను రూపొందించి డిసెంబర్ 6 లోగా కార్యాచరణ కోసం ఏర్పాట్లు చేయాలని సభ్యులు కార్యక్రమంలో ముక్త కంఠంతో పేర్కొన్నారు.నూతన జేఏసి కన్వీనర్ లు గా మాతంగి శంకర్, సుగుర్తి జగదీశ్వరాచారి, వంతడుపుల సంపత్,దుండ్ర రాజయ్య,బోయిని తిరుపతి,అంబాల సతీష్ లను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.కార్యక్రమంలో ముఖ్య నాయకులు బోయిని కొమురయ్య, కనకం రాములు,మాతంగి అశోక్,ఎడ్ల జోగిరెడ్డి,మీసాల అంజయ్య,మాతంగి లక్ష్మణ్, బోయిని తిరుపతి,సముద్రాల లక్ష్మణ్,కనకం ఆంజనేయులు,పార్నాంది జలపతి, కోరెపు లక్ష్మణ్, బోయిని కృష్ణబాబు,వేల్పుల ఓదయ్య,బూట్ల శ్రీనివాస్,కిన్నెర అనిల్,రెడ్డి గాని రాజు,సందుపట్ల మల్లేశం,చింతం శ్రీనివాస్,నగునూరి బాబు,గాండ్ల శ్రీనివాస్,కొయ్యడ మురళి,ఖమ్మం కృష్ణ,రాచమళ్ళ దుర్గా ప్రసాద్,కొమ్ము సంపత్,ఉప్పులేటి రాజు,అలవాల సంపత్,అలవాల కుమార్,బోయిని దివాకర్,అఖిల పక్ష పార్టీల నాయకులతో పాటుగా మండలంలోని ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !