+91 99635 77856

ఘనంగా కార్తిక వనభోజనాలు

ఘనంగా కార్తిక వనభోజనాలు
ధర్మసాగర్/ నవంబర్ 26 (మా అక్షరం): హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలో మార్కండేయ స్వామి ఆలయ ఆవరణలో జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కార్తీక వన భోజన
కార్యక్రమంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో కార్తీక వనభోజనాల పేరుతో మన పద్మశాలీలు సభలు వివిధ జిల్లాలలో జరుపుకుంటూ వస్తున్నారు కానీ ఎక్కడికి వెళ్లిన కూడా ఒకే మాట పద్మశాలీలో ఐక్యత లేదని రాజ్యాధికారం లేదని మన కులంలో ఎమ్మెల్యే, ఎంపీలు లేరు అనే మాట వినబడుతుంది కానీ అది చాలా తప్పుడు విధానం మనలో మనమే చాలా చిన్నతనం చేసుకుంటున్నాం మనకు రాష్ట్రంలో ఏ గ్రామానికి పోయినా అధిక విద్యార్హత, బ్రాహ్మణత్వం, డాక్టర్స్, వివిధ శాఖల అధికారులు ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నారని, మన జాతిలో ఉన్నంత అధికార ఘనం ఏ సామాజిక వర్గంలో లేరని ఈ విషయాన్ని మీరందరు గమనించగలరని కోరారు. కాబట్టి రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి పద్మశాలి అధికార గణాన్ని మనందరం ఒకే వేదిక మీదికి తీసుకురావాలని, మన జాతి ఉజ్వల భవిష్యత్తు కొరకు సన్నాహాలు చేయాలని అన్నారు. జరగబోయే స్థానిక ఎన్నికలలో పద్మశాలీలు ముందంజలో ఉండి అధిక సంఖ్యలో పోటీ చేసి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు వల్లకాటి రాజ్ కుమార్ గౌరవ అధ్యక్షులు వేముల బాలరాజ్ ప్రధాన కార్యదర్శి గంజ శ్రీనివాస్,రాష్ట్ర అసోసియేట్ అద్యక్షులుదుస్స శివశంకర్, జనార్దన్,బిల్లా యదగిరి, పెద్దూరి సంజీవ అనుబంధ సంఘాల అధ్యక్షులు,పద్మశాలి ప్రముఖులు,వివిధ రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !