కరీంనగర్, తిమ్మాపూర్/నవంబర్27(మా అక్షరం):జాతీయ మాల మహనాడు తిమ్మాపూర్ మండల అధ్యక్షులు ఎలుక రాజు ఆధ్వర్యంలో తిమ్మాపూర్ మండల కేంద్రంలో చలో మాలల సింహ గర్జన పోస్టర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ఎలుక రాజు మాట్లాడుతూ..డిసెంబర్ 1వ తేదీన హైదరాబాద్ పేరెడ్ గ్రౌండ్ లో జరిగే మాలల సింహగర్జన సభకు అధిక సంఖ్యలో మాల సోదరులందరూ మాలల సింహ గర్జన సభకు ఇంటికి తాళాలు వేసి అందరు స్వచ్ఛంద తరలివచ్చి,ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య, ప్రచార కార్యదర్శి తాళ్ల వెంకటేష్, జిల్లా ప్రధానకార్యదర్శి ఎలుక అంజనేయులు, రాష్ట్ర నాయకులు గంట శ్రీనివాస్, దామెర సత్యం, ఇరుకుల్లా యాదగిరి, మండల నాయకులు ఎలుక శ్రీధర్, దొంత తిరుపతి, రొడ్డ రమేష్,పురం బాబు, బురుగు అంజయ్య, మూలకల రాజు కుమార్, బొబ్బిలి అఖిల్, కిరణ్, గూడ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు











