కరీంనగర్, తిమ్మాపూర్/ నవంబర్ 27 (మా అక్షరం):మానకొండూరు మండలం గంగిపల్లిలో బుదవారం వరిగడ్డి లోడ్తో వెళ్తున ట్రాక్టర్ విద్యుదాఘాతానికి గురై గడ్డికట్టలు ఆగ్నికి ఆహుతయ్యాయి.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శంషాబాద్ గ్రామానికి చెందిన రైతు గంగిపల్లి నుండి వరిగడ్డి కట్టలను ట్రాక్టర్లో శంషాబాద్ కు తీసుకెళ్తున్న క్రమంలో గ్రామపంచాయతీ వద్ద గడ్డిలోడుకు సర్వీసు వైరుతీగలు తగిలి ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో వరి గడ్డికట్టలు పూర్తిగా దగ్ధమయ్యాయి. గమనించిన స్థానికులు మంటలు అర్పడంతో పెను ప్రమాదం తప్పింది
Post Views: 40











