కరీంనగర్, తిమ్మాపూర్/ డిసెంబర్ 02 (మా అక్షరం):తెలంగాణ ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలో నూతనంగా మంజూరైన ప్రభుత్వ నర్సింగ్ కళాశాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సోమవారం హైదరాబాద్ నుండీ వర్చ్యువల్ గా శంకుస్థాపన చేశారు.కరీంనగర్ ప్రభుత్వ వైద్య కళాశాల నుండి నర్సింగ్ కళాశాల నుంచి నిర్వహించిన వర్చ్యువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమీలా సత్పతితో కలిసి మానకొండూర్ శాసనసభ్యులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.
Post Views: 43











