హుజురాబాద్/డిసెంబర్07(మా అక్షరం):జాతీయ స్థాయి హాకీ జట్టు కోచ్ గా యేముల రవికుమార్ ను ఎస్ జి ఎఫ్ టీ ఎస్ సెక్రటరీ రామ్ రెడ్డి నియమించినట్లు కరీంనగర్ జిల్లా ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి వేణుగోపాల్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.ఈనెల 9-12-2024 నుండి 14 -12-2024 వరకు మధ్యప్రదేశ్ లోని మండాసూర్ లో జరిగేజాతీయస్థాయి హాకీ అండర్ 14 గర్ల్స్ టోర్నమెంట్ కు తెలంగాణ రాష్ట్రానికి హాకీ కోచ్ గా శంకరపట్నం మండలం మెట్టిపల్లి పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న యేముల రవికుమార్ ఎంపికైనట్లు ఆయన తెలిపారు.రవికుమార్ ఎంపిక పట్ల హుజురాబాద్ హాకీ క్లబ్ శాశ్వత అధ్యక్షుడు తోట రాజేంద్రప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షుడు బండ శ్రీనివాస్, క్లబ్ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు సొల్లు సారయ్య హాకీ క్లబ్ కార్యదర్శి ఉమామహేశ్వర్, కోచ్ t శ్రీనివాస్, క్లబ్బు ఉపాధ్యక్షులు భూసారపు శంకర్, హాకీ క్రీడాకారులు గుడ్డేలుగుల సమ్మయ్య,పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిరునారి విష్ణుకుమార్, రాజేష్,సాయి కృష్ణ ప్రదీప్ లు హర్షం వ్యక్తం చేశారు.











