హుజురాబాద్/డిసెంబర్ 10 (మా అక్షరం): 68వ జాతీయస్థాయి ఎస్ జి ఎఫ్ హాకీ టోర్నమెంట్ లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్ లో ఢిల్లీపై తెలంగాణ హాకీ జట్టు 2-0 తో విజయం సాధించింది.ఈ విజయంలో నిమ్మటూరి మిధున,వర్షిత చెరి చెరో గోల్ చేసి తెలంగాణ టీం కి విజయంపై కీలక పాత్ర పోషించినట్లు కోచ్ వేముల రవికుమార్ మేనేజర్ శ్రీనివాసులు తెలిపారు. తెలంగాణ జట్టు విజయం సాధించడంతో శాశ్వత అధ్యక్షుడు తోట రాజేంద్రప్రసాద్, కరీంనగర్ జిల్లా హాకీ క్లబ్ ఉపాధ్యక్షులు బండ శ్రీనివాస్, హుజురాబాద్ హాకీ క్లబ్ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, సెక్రటరీ ఉమామహేశ్వర్, క్లబ్ ఉపాధ్యక్షుడు భూసారపు శంకర్,సీనియర్ క్రీడాకారులు జీ.సమ్మయ్య , హుజురాబాద్ హాకీ కోచ్ తిరునాహరి శ్రీనివాస్,బండ రఘు, కె.బిక్షపతి, సాదుల శ్యాం కుమార్,రమేష్,తిరుపతి,రాజేష్,సాయి కృష్ణ, ఎం విక్రం, శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.
Post Views: 177











