+91 99635 77856

కాంగ్రెస్ పార్టీ, అఖిలపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం

హుజరాబాద్/డిసెంబర్19(మా అక్షరం): పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గురువారం కాంగ్రెస్ పార్టీ, అఖిలపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…పార్లమెంటులో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను అవహేళన చేస్తూ అవమానపరుస్తూ భారత రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన కార్యక్రమం చేస్తున్నామన్నారు. తక్షణమే కేంద్ర హోం మంత్రి ని బర్తరం చేసి బిజెపి నుంచి బేషరతుగా తొలగించాలని,అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యస్సి సెల్ పట్టణ అధ్యక్షులు ఏర్ర రవీందర్,సొల్లు బాబు,లంకదాసరి లావణ్య,కొలిపాక శంకర్, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మిడిదొడ్డి రాజు,ఏర్ర రమేష్,కడారి తిరుమల, సొల్లు సునిత,ప్రజాసంఘాల నాయకులు వేల్పుల ప్రభాకర్,మోరె సతీష్,ఇల్లందుల సమ్మయ్య,సంధ్యల వెంకటేశ్వర్లు,దాట్ల ప్రభాకర్,తిప్పారపు భువనచందర్,రేణికుంట్ల సందీప్,చిట్యాల రేవంత్,యండి అఫ్సర్, యండి సాదిక్, బోరగాల రాజయ్య,వేల్పుల రత్నం, లంకదాసరి ప్రవీణ్,బీమోజు సదానందం తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !